రోడ్డు ప్రమాదంలో పుర కార్మికులకు గాయాలు
NEWS Nov 07,2024 04:16 am
కోరుట్ల పట్టణంలోని పాత బస్టాండ్ జాతీయ రహదారి పక్కన ఉదయం మున్సిపల్ కార్మికులు విధులు నిర్వహిస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ తిరుపతి హుటాహుటిన కార్మికులను జగిత్యాల ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. గాయపడిన వారిలో కార్తీక్, కనకతార, గంగు, సుగుణ, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కమిషనర్ తెలిపారు.