ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత
NEWS Nov 07,2024 03:34 am
కథలాపూర్ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీని మెట్పల్లి శివారులో రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పట్టుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. వట్టి వాగు వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. లారీని ఆపి తనిఖీ చేయగా అనుమతి లేని ఇసుకను తరలిస్తుండడంతో లారీని పట్టుకొని స్టేషన్ కు తరలించామన్నారు. రెవెన్యూ సిబ్బంది రాజ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.