సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
NEWS Nov 06,2024 05:03 pm
తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఆదేశాల మేరకు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనలతో జిల్లా సైబర్ క్రైమ్స్ కో-ఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త విధానాలతో అమాయకుల ఖాతాల నుండి నగదును ఏ విధంగా కాజేస్తున్నారో వివరించారు. డిజిటల్ అరెస్టులు, కస్టమర్ కేర్ మోసాలపై అవగాహన కల్పించారు.