ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ
NEWS Nov 06,2024 05:04 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాచారం, గుండుగులపల్లి, దమ్మపేట గ్రామాల్లో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.