చారిత్రాత్మక నిర్ణయమే ఈ కులగణన
NEWS Nov 06,2024 05:10 pm
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కుల గణన చేయడం చారిత్రాత్మక నిర్ణయమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చరిత్రలోనే మొదటిసారిగా కులగణన కార్య క్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రారంభించినట్లు చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. టీజీ ఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి తదితరులు పాల్గొన్నారు