సీఎం బర్త్ డే సందర్భంగా రక్తదాన శిబిరం
NEWS Nov 06,2024 04:50 pm
కామారెడ్డి: నవంబర్ 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా సూర్య భాయ్ యూత్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తామని సూర్య భాయ్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ, డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావు, మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్ లు సూర్య భాయ్ పాల్గొంటారు.