చికిత్స పొందుతూ యువకుడి మృతి
NEWS Nov 06,2024 08:28 am
జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని ఇటీవల మాల్లెగుంట ప్రాంతంలో మండల కేంద్రానికి చెందిన బైరి చందు అనే యువకుడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో చందును మెరుగైన చికిత్స కోసం HYD హాస్పిటల్కు తరలించి.. కొద్ది రోజులకు కరీంనగర్లో ఓ ప్రైవేటు హాస్పిటల్కు తీసుకురాగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి కొడుకు, కూతురు ఉన్నారు.