రోడ్డు నిర్మాణ పనులకు MLA శంకుస్థాపన
NEWS Nov 06,2024 08:27 am
జగిత్యాల పట్టణ 44వ వార్డులో రూ. 10 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కలిసి భూమి పూజ చేశారు. అనంతరం నిత్య జనగణమన కార్యక్రమంలో భాగంగా జాతీయ గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.