పలు కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ
NEWS Nov 06,2024 08:29 am
మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామంలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన గడ్డం లక్ష్మీ రాజాం కుటుంబాన్ని, అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రి నుండి ఇటీవలే డిశ్చార్జి అయిన నత్తి నర్సారెడ్డి, బోయిని రాయమల్లులను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పరామర్శించారు. ఆయా కుటుంబాలకు తాను అండగా ఉంటానని భరోసా నిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.