ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
NEWS Nov 06,2024 08:26 am
కరీంనగర్ SRR వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది, స్థానికుల ప్రకారం. జగిత్యాల వైపు వెళ్తున్న లారీని వెనకనుంచి బైకు ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కథలాపూర్ తాండ్రియ్యలకు చెందిన నాగరాజు గాయపడగా.108లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందినవారు చల్లూర్ కు చెందిన శ్రీహస్, మరోవ్యక్తి కొత్తపల్లికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు.