ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Nov 06,2024 06:22 am
మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం మల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత- నర్సయ్య ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రల్లోనే ధాన్యం అమ్ముకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.