మద్యం అమ్మకాల విధి విధానాల సమావేశం
NEWS Nov 06,2024 04:43 am
మైలవరం మండలంలోని మద్యం దుకాణాల లైసెన్సులు ఉన్నవారితో సమవేశం ఏర్పాటు చేశారు. మద్యం అమ్మకాల విధి విధానాలు, ఎంఆర్పీ ధరకే అమ్మకాలు చేయాలని, ఒక వ్యక్తికి 3 బాటిల్స్ కంటే మించి ఇవ్వరాదని, 21సం. వయస్సులోపు వారికి మద్యం అమ్మరాదని.. అనధికారిక మద్యం అమ్మకాలు చేసేవారికి మద్యం అమ్మరాదని మైలవరం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సూచించారు.