గంజాయి విక్రయించే వారిపై కఠిన చర్యలు
NEWS Nov 05,2024 07:00 pm
మేడిపల్లి మండలంలో గంజాయి సరఫరా చేసినా, విక్రయించిన వారిపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని ఎస్ఐ శ్యామ్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఈజీ మనీకి అలవాటు పడి తమ ఉజ్వల భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. గంజాయి విక్రయించే నిందితులు ఎవరైనా సరే చట్టప్రకారం శిక్షార్హులన్నారు.