డయల్ 100 కాల్ చేస్తే ముగ్గురి ప్రాణాలు సేఫ్..
NEWS Nov 05,2024 03:19 pm
బాల్కొండలో గృహిణి కుందారపు స్రవంతి (32) తన భర్త కేదార్తో గొడవ పడి, తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అది గమనించిన స్థానికులు 100 నెంబర్ కు కాల్ చేయగా, మెండోరా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని స్రవంతిని ఆమె ఇద్దరు పిల్లల్ని కాపాడి పోలీస్ స్టేషన్కు తరలించారు. మెండోరా ఎస్ఐ నారాయణ ఆమె భర్తను, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.