వైజ్ఞాన ప్రదర్శనలు విద్యార్థులకు దోహదపడతాయి
NEWS Nov 05,2024 12:29 pm
నవంబర్ 18,19,20వ తేదీలలో అనపరెడ్డిపల్లిలో జరిగే జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు సమాజానికి, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులను తయారు చేసి ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. జిల్లాలో ప్రత్యేకంగా చేపట్టిన మునగ సాగు, వర్షపునీటి గుంటల తయారీ, సాంప్రదాయ నిర్మాణ పద్ధతులు కేవలం అలంకరణ కోసం కాకుండా వాటి ద్వారా విద్యార్థులు గుణాత్మకమైన వ్యవసాయ వేత్తలుగా, శాస్త్రవేత్తలుగా తయారయ్యేటట్లుగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ చెప్పారు.