హోం మంత్రిను సన్మానించిన ఎమ్మెల్యే
NEWS Nov 05,2024 01:16 pm
రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా మడకశిర ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబెర్ ఎం.ఎస్ రాజు స్వగృహానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు, ఆయన సతీమణి ఉమాదేవి కుటుంబ సభ్యులు హోం మంత్రికి శాలువాతో పూలమాలలు వేసి వెంకటేశ్వర చిత్రపటాన్ని బహుకరించి సన్మానించారు.