వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను
ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్
NEWS Nov 05,2024 06:20 am
మల్లాపూర్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్, చిట్టాపూర్, సాతారం గ్రామాల్లో ఐకెపి వారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. రైతులు వరి ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. మధ్య దళారులకు తక్కు వ ధరకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని చెప్పారు.