రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు రిశ్వంత్
NEWS Nov 05,2024 04:30 am
రాయికల్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి అండర్-14 కబడ్డీ పోటీల్లో పాల్గొని దానవేణి రిశ్వంత్ తన ప్రతిభను చాటుకున్నారు. రాయికల్ మండలం నుంచి రాష్ట్రస్థాయికి ఎన్నికైన ఏకైక పాఠశాల ప్రగతి ఉన్నత పాఠశాల అని తెలిపారు. రాష్ట్రస్థాయికి ఎన్నికైన దానవేణి రిశ్వంత్ను పాఠశాల కరస్పాండెంట్ బాలె జయశ్రీ శేఖర్, అకడమిక్ డైరెక్టర్ బాలె నిఖిల్, పిఇటి మహేశ్, అధ్యాపక బృందం, పలువురు అభినందించారు.