DSC 2008 అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలి
NEWS Nov 05,2024 03:26 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన DSC 2008 సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశానికి ముఖ్య అతిథిగా బానోత్ రాములు నాయక్ హాజరయ్యారు. డీఎస్సీ 2008 అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి అయ్యి నేటితో నెల రోజులు కావస్తున్నా పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. కాలయాపన చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియామక పత్రాలు అందజేయాలని TTF రాష్ట్ర సహాధ్యక్షులు బానోతు రాములు నాయక్ డిమాండ్ చేశారు. LVBM రత్నా, జిల్లా అధ్యక్షుడు మోహన్ పాల్గొన్నారు.