అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
NEWS Nov 04,2024 06:30 pm
మెట్ పల్లి మండలంలోని వేంపేట గ్రామ శివారులో, టిఎస్ 01 uc 5721 నంబర్ గల ఆటోలో, అక్రమంగా తరలిస్తున్న సుమారు 22 క్వింటాల పిడిఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మెట్ పల్లి మండలం నుండి ఖానాపూర్ కు తరలిస్తున్నారని తెలిపారు సిఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై రాజు. ఆటోతో పాటు, నిర్మల్ జిల్లాకు చెందిన డ్రైవర్ ఎండి హైదర్ పై కేసు నమోదు చేశారు.