ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ
NEWS Nov 04,2024 03:26 pm
రాయికల్ మండలంలోని మహితాపూర్, రామోజీపేట్ గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం ఎంత మొత్తంలో వస్తుందో, ధాన్యానికి సంబంధించిన తేమ ఏ విధంగా ఉందో పరిశీలించారు. ధాన్యాన్ని తీసుకొని దాని మ్యాచర్ ఏ విధంగా ఉందో చూసారు. సంబంధిత ఏఈఓ నుంచి కేంద్రం ఏ విధంగా నడుస్తుందోననే వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.