TDP సభ్యత్వ నమోదు కార్యక్రమం
NEWS Nov 04,2024 03:32 pm
మాజీ ఎంపీటీసీ సీనియర్ నాయకులు గోరజాల సాంబశివరావు (చిన్ని) లక్ష రూపాయలు చెల్లించి తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం స్వీకరించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై చిన్నిని ఘనంగా శాలువాతో సత్కరించారు. మొదటిరోజు 200 మంది కార్యకర్తలు సభ్యత్వ నమోదుని స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, గరికపాటి శ్రీనివాసరావు, గంజి నరసింహారావు,గ్రామ పార్టీ అధ్యక్షుడు కాకి నాగరాజు, జంపాల సీతారామయ్య, మండల పార్టీ అధ్యక్షుడు రామినేని రాజశేఖర్ పాల్గొన్నారు.