జగిత్యాల ప్రజావాణికి 22 ఫిర్యాదులు
NEWS Nov 04,2024 10:29 am
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరపాలని, పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 22 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి, ఆర్డీఓలు మధు సుధన్, శ్రీనివాస్, జివాకర్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ. హన్మంత రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.