విద్యార్థినులకు ఏకరూప దుస్తులు
NEWS Nov 04,2024 11:01 am
మైలవరం పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 40 మంది విద్యార్థినులకు ఏకరూప దుస్తులను (యూనిఫామ్) మైలవరం MLA వసంత వెంకట కృష్ణప్రసాదు పంపిణీ చేశారు. మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు శ్రీలంకా లితీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని,ఆయన సౌజన్యంతో దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం కూడా ముఖ్యమన్నారు. సెల్ ఫోన్లను విజ్ఞానం కోసం మాత్రమే ఉపయోగించాలన్నారు.