ఆయా గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం..
NEWS Nov 04,2024 10:46 am
టేక్మాల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో టేక్మాల్, ఎల్లంపల్లి, ధన్నూర, చంద్రుతండాలలో సంఘం సభ్యులు, మండల కాంగ్రెస్ నేతలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు ధాన్యం అమ్ముకొని మద్దతు ధర పొందాలని, అలాగే సన్న రకం వరి ధాన్యంకు రూ. 500 బోనస్ను కూడా పొందాలని వారు రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు, రైతులు పాల్గొన్నారు.