మాజీ సర్పంచ్ ల ముందస్తు అరెస్టు
NEWS Nov 04,2024 07:12 am
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండల సర్పంచుల పెండింగ్ బిల్లు విడుదల చేయాలనీ చలో హైదరాబాద్ పోరు బాట వెళ్తున్న వివిధ గ్రామాల మాజీ సర్పంచులను సదశివాపేట పోలీసులు అరెస్టు చేశారు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ముందస్తు అరెస్టు చేసిన వారిలో మాజీ సర్పంచులు లక్ష్మరెడ్డి, శ్రీహరి, శ్రీనివాస్, కుమార్, తదితరులు ఉన్నారు.