మూలపాడులో గోల్ఫ్ కోర్టు: ఎంపీ
NEWS Nov 04,2024 10:40 am
ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు క్రికెట్ స్టేడియంకు త్వరలో మంచి రోజులు రానున్నాయని ఎంపీ కేసినేని శివనాథ్(చిన్ని) అన్నారు. మూలపాడులోని గోకరాజు లైలా గంగరాజు క్రికెట్ స్టేడియాన్ని ఆయన సందర్శించారు. స్విమ్మింగ్ పూల్, స్టోర్ రూములు అపరిశుభ్రంగా ఉండటంతో స్టేడియం మేనేజర్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే గ్రామానికి త్వరలో గోల్ఫ్ కోర్టు రానుందని.. మండలంలో దాదాపు 400మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.