ఉర్దూలో ఆర్టీసీ సైన్ బోర్డులు
NEWS Nov 04,2024 06:54 am
మెట్ పల్లి: వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల సైన్ బోర్డుల్లో తెలుగు, ఇంగ్లీష్ మాత్రమే ఉండడంతో ఉర్దూలో కూడా ఉండాలని అంజుమన్ ఇషాత్ ఏ ఉర్దూ ఆధ్వర్యంలో మెట్ పల్లి డిపో మేనేజర్ దేవరాజు సహకారంతో వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు బస్సుల సైన్ రోడ్లపై ఉర్దూలో రాశారు. ఎవరికి కూడా భాష సమస్య ఉండకూడదని ఈ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు అంజుమన్ ఇషాత్ ఏ ఉర్దూ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇషాత్ ఏ ఉర్దూ అధ్యక్షుడు, అజీజ్, కోశాధికారి, ఇబ్రహీం, కార్యదర్శి భారీ, ఖాస్మ,షాహిద్ పాల్గొన్నారు.