గంజాయి తరలిస్తున్న ముగ్గురిపై కేసు
NEWS Nov 03,2024 05:23 pm
రాజీవ్ బైపాస్ చౌరస్తా వద్ద స్కూటీపై గంజాయి తరలిస్తున్న రూరల్ మండలం బాలపెల్లికి చెందిన జక్కుల మధు, పెగడపల్లి మండలం వెంగళయపేటకు చెందిన రాచర్ల వంశీ, పాలకుర్తి మండలం కుక్కల గూడూరుకు చెందిన నలిమేల వినోద్లపై కేసు నమోదు చేశారు జగిత్యాల పట్టణ సిఐ వేణు గోపాల్. వీరిలో రాచర్ల వంశీ మీద గతంలో 2గంజాయి కేసులు, నల్లమల వినోద్ మీద గతంలో 7 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయన్నారు.