మెస్ చార్జీలు పెంచడం పట్ల హర్షం
NEWS Nov 03,2024 10:26 am
మెట్పల్లి: యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్లను నియమించడంతో పాటు, విద్యార్థులకు కాస్మోటిక్, మెస్ చార్జీలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు సుఖీభవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు బొక్కెనపల్లి నాగరాజు. ప్రభుత్వ పని తీరుకు ఈ నిర్ణయాలు నిదర్శనమన్నారు. గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి మెను ప్రకారం భోజనం ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో గట్టయ్య, స్వామి, శంకర్ ఉన్నారు.