మెట్పల్లి: ఘనంగా ఆత్మీయ సమ్మేళనం
NEWS Nov 03,2024 10:23 am
మెట్పల్లి పట్టణంలోని శ్రీవాణి నికేతన్ విద్యాలయం హైస్కూల్ 1998-99 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులందరూ పదో తరగతి పూర్తయి 25 సంవత్సరాలు అవుతుందని, వారు వివిధ హోదాలలో స్థిరపడి ఉన్నారని, గురువుల ఆశీస్సులు ఎప్పుడూ ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ, వారికి పాఠాలు చెప్పిన గురువులకు సన్మానం చేసి, వారి జ్ఞాపకార్థంగా మెమెంటోలు ఇచ్చి, వారి పూర్వ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.