వడ్ల రైతులకు కలెక్టర్ హామీ
NEWS Nov 03,2024 06:43 am
వడ్లను కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందిన రైతులు మూకుమ్మడిగా సిరిసిల్ల కామారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్, బిజెపి మద్దతును తెలిపాయి. ధర్నా ఉధృతం కావడంతో సమాచారం తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ధర్నా జరుగుతున్న చోటుకు చేరుకుని రైతులతో మాట్లాడి అనంతరం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడుతూ వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు.