జువ్వాడి సూర్య రావు పార్థివ దేహానికి నాయకుల నివాళులు
NEWS Nov 03,2024 06:06 am
మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తమ్ముడు, ధర్మపురి దేవాలయం మాజీ ఛైర్మెన్ జువ్వాడి సూర్యరావు అనారోగ్యంతో కన్నుమూశారు. సూర్యరావు పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగ రావు, కృష్ణరావు. రాంచందర్ రావు, గిరి నాగభూషణం,సాగర్ రావు, అడువాలా లక్ష్మణ్ తదితరులు నివాళి అర్పించారు.