బిజెపి ముఖ్య కార్యకర్తల సమావేశం
NEWS Nov 02,2024 05:50 pm
మెదక్ జిల్లా రామాయంపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గం ఇంచార్జ్ పంజా విజయ్ కుమార్ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు, స్థానిక ప్రజా సమస్యలపై ఉద్యమ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. పార్టీ బలోపేతం చేయడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శంకర్ గౌడ్, దిలీప్, నరేందర్, ఎల్లం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.