విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ
NEWS Nov 02,2024 05:31 pm
మెదక్ జిల్లా తూప్రాన్, నర్సాపూర్, వెల్దుర్తి మహాత్మా గాంధీ గురుకుల బాలికల కళాశాలలో జిఎంఆర్ వరలక్ష్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీనియర్ మేనేజర్ శివ, గణేష్ ఆధ్వర్యంలో కంప్యూటర్ కోడింగ్, కాగ్నిజెంట్ పై ఉచిత శిక్షణ అందజేశారు. 48 వారాలపాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. శిక్షణ కలం పూర్తయ్యేలోపు విద్యార్థులకు సాఫ్ట్వేర్లను తయారు చేసే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.