విశాఖపట్నం రుషికొండపై కట్టిన భవనాలు చూశాక ఆశ్చర్యం, ఉద్వేగం కలిగాయని సీఎం చంద్రబాబు అన్నారు. రుషికొండ భవనాలను చూస్తే రాజులు కూడా ఇలాంటి ఆఫీసులు కట్టుకుంటారని అనుకోవడంలేదని, ఆ కారిడార్ చూస్తుంటే అమెరికా వైట్హౌస్లో కూడా అలాంటిది ఉండదేమో అనిపించింది. మన రాష్ట్రపతి భవన్ లోనూ లేదని చెప్పారు. ఒక వ్యక్తి స్వార్థం కోసమే రుషికొండ ప్యాలెస్ కట్టారని ఆరోపించారు.