వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NEWS Nov 02,2024 12:45 pm
చౌటుకూరు మండలంలోని వెండి కోల్, పోషణపల్లి, బొమ్మరెడ్డి గూడెం, ఉపరి గూడెం, బద్రి గూడెం, తడ్దన్ పల్లి గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను చౌట్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నత్తి దశరథ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీఓ శివ లక్ష్మి, మండల నాయకులు మల్లారెడ్డి, పత్తి రాములు, బాల్లగొండ, ఈశ్వర్, శ్రీహరి, గోవర్ధన్, సంగు భరత్, దేవదాసు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.