మెస్ చార్జీలు పెంచినందుకు పాలాభిషేకం
NEWS Nov 02,2024 12:16 pm
మల్లాపూర్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మినీ గురుకులంలో మెస్ చార్జీలు పెంచినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మల్లాపూర్ మండల కేంద్రంలోని మినీ గురుకులంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ప్రియాంక, టీచర్స్ సునీత, సుమలత, సులోచన, శ్రీలత, జ్యోతి, విద్యార్థులు పాల్గొన్నారు.