మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేవారి జలాల్పూర్ గ్రామంలోని కాళికాదేవి ఆశ్రమాన్ని శ్రీ జగదాంబ త్రీ శక్తిపీఠం అధిపతి బ్రహ్మశ్రీ తాలూరి బనారస్ బాబా సందర్శించారు. ఈ సందర్భంగా కాళికామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ కాళికామాత దేవాలయం గోశాల వద్ద నిత్య అన్నదానం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రవచనాలను వినిపించారు. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీమాతా ఉద్ధం సేవ ట్రస్టు చైర్మన్ పాల్గొన్నారు.