కొమిరెడ్డి జ్యోతక్క కోలుకోవాలని పూజలు
NEWS Nov 02,2024 10:01 am
మల్లాపూర్: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్క అనారోగ్యం నుంచి తొందరగా కోలుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రార్థించారు. కార్తీక మాసం తొలి రోజు మల్లాపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులతో ఆవు పాలతో అభిషేకం చేసి, ప్రత్యేక పూజాలు నిర్వహించారు.