ఆలయ పునర్నిర్మాణం కోసం రూ. 1,35,000
NEWS Nov 02,2024 09:57 am
మెట్పల్లి: శివ భక్త మార్కండేయ దేవాలయ పునర్నిర్మాణం కోసం మెట్పల్లి వాసి రేణికుంట వెంకటేశం రూ. 1,35,000 చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకున్నాడు. వెంకటేశంకు వారి కుటుంబ సభ్యులకు శ్రీ శివ భక్త మార్కండేయ మహర్షి, వినాయకుడి, సుబ్రహ్మణ్యేశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని పద్మశాలి సంఘం నాయకులు ఆకాంక్షించారు. పద్మశాలి సంఘం అధ్యక్షులు ధ్యావనపల్లి రాజారాం, ఉపాధ్యక్షులు సంకు ఆనంద్, గుంటుక గౌతమ్ కోశాధికారి బేతు భాస్కర్, ధ్యావనపల్లి గణేష్ మురళి, గురుడు హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.