కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రం
NEWS Nov 02,2024 08:20 am
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సమావేశాలు నిర్వహిస్తోందని, పేద బలహీన వర్గాల వారు అత్యున్న స్థాయికి వెళ్లడానికి కుల గణన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని పెద్దపల్లి ఎంపీగడ్డం వంశీకృష్ణ అన్నారు. దేశంలోనే కుల గణన చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఖ్యాతి గడించనుందని, 70% ఉన్న బలహీన వర్గాల వారు సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కుల గణన ఉపయోగపడుతుందన్నారు.