సామాన్య కుటుంబంలో జన్మించి బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ ఇచ్చిన రాజకీయ అవకాశాన్ని ఎర్రన్నాయుడు వినియోగించుకుని ప్రజాసేవ చేశారని TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఎర్రం నాయుడు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా దేవినేని ఉమా మాట్లాడుతూ మరణించే వరకు ఆయన ప్రజల కోసమే పనిచేశారని గుర్తు చేశారు.