విద్యార్థులకు నగదు బహుమతుల ప్రదానం
NEWS Nov 02,2024 08:17 am
10వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అందజేశారు. మైలవరంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. సరస్వతి ఫౌండేషన్ నిర్వాహకులు కుడుముల తిమ్మారెడ్డి అండ్ సన్స్ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కార అవార్డ్స్ ను అందజేశారు.ఈ సందర్భంగా వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్న స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.