ఎస్జీటీలకు మినహాయింపు ఇవ్వాలి
NEWS Nov 02,2024 06:10 am
మెదక్: కుల గణన నుండి ఎస్జీటీలకు మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం సర్వే చేయించాలనుకుంటే అత్యవసర విభాగాలు మినహాయించి మిగిలిన అన్ని విభాగాల ఉద్యోగులతో 2 రోజులలో సర్వే చేయించుకోవాలని మెదక్ జిల్లా తపస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మన్ కోరారు. మెదక్ జిల్లా తపస్ కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో తపస్ నాయకులు సంతోష్, కృష్ణ గౌడ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.