గురుకుల పాఠశాలలో లక్ష్మీ పూజ
NEWS Nov 01,2024 06:27 pm
మల్యాల: మల్యాల మండలంలోని తాటిపల్లి బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు చేసిన నరకాసుర వధ నాటక ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థినిలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, లక్ష్మీ పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినిలు, విద్యార్థినిల తల్లిదండ్రులు పాల్గొన్నారు.