రోడ్డు నిర్మాణ శంకుస్థాపనకు ఏర్పాట్లు సిద్ధం
NEWS Nov 01,2024 06:28 pm
మల్యాల మండలంలోని క్రాస్ రోడ్ వద్ద నుండి కాచారం వరకు 25 కోట్లు వెచ్చించి డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం జరగబోయే పర్యటనకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, చొప్పదండి నియోజకవర్గం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అధికారులు, కాంట్రాక్టర్లు, నాయకులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి పోలీసులు ప్రతిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.