ఇద్దరు దొంగల అరెస్ట్, రిమాండ్
NEWS Nov 01,2024 05:08 pm
జగిత్యాల: ల్యాప్టాప్లు, నగదు దొంగిలించిన ఇద్దరు వ్యక్తులని అరెస్ట్ చేసినట్లు సీఐ వేణు గోపాల్ తెలిపారు. జగిత్యాల కొత్త బస్టాండ్లో ఓ బ్యాంక్ ఉద్యోగికి చెందిన ల్యాప్టాప్ను దీపక్ రెడ్డి అనే వ్యక్తి దొంగిలించాడు. అలాగే అదే ప్రాంతంలో మరో వ్యక్తి బ్యాగులో నుంచి కొమురం సతీష్ అనే వ్యక్తి రూ. 18 వేల 300 దొంగిలించాడు. ఈ మేరకు దీపక్ రెడ్డి, సతీష్ నుంచి ల్యాప్టాప్, నగదు రికవరీ చేసి రిమాండ్ చేసినట్టు సీఐ తెలిపారు.