SMC చైర్మన్ను సన్మానించిన రజక సంఘం
NEWS Nov 02,2024 08:24 am
ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామ రజక సంఘం మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించింది. ఈ సందర్భంగా మడలేశ్వర స్వామి ఆలయం వద్ద రజక సంఘం సభ్యులందరూ చైర్ పర్సన్ షేక్ సాబేర బేగం ను శాలువాతో సత్కరించారు, ఈ సందర్భంగా రజక సంఘం అధ్యక్షులు దొమ్మాటి భూపతి మాట్లాడుతూ.. దోబి ఘాట్ కు ప్రహరీ గోడ నిర్మాణం కావాలని కోరారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య, రజక సంఘం నాయకులు దొమ్మాటి రాజయ్య, పర్శరాములు, దేవయ్య, కిషన్ తదితరులు పాల్గొన్నారు.