దీపం పథకాన్ని ప్రారంభించిన ముక్కా
NEWS Nov 01,2024 07:15 pm
రైల్వేకోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ముక్కరూపానంద రెడ్డి శుక్రవారం దీపం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో TDP నాయకులు పాల్గొన్నారు.